మాస్ మహారాజ రవితేజ గతంలో సంవత్సరంలో మూడు నాలుగు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవాడు.సక్సెస్, ఫెయిల్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రవితేజ గత రెండు సంవత్సరాలుగా జోరును తగ్గించాడు.
సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు.ఈ సంవత్సరం ‘కిక్`2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ వెంటనే మరో సినిమాను కూడా రవితేజ విడుదల చేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
‘కిక్`2’ చిత్రీకరణ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేసిన రవితేజ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాళ్ టైగర్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ను పూర్తి చేసుకుని మూడవ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ సినిమా చిత్రీకరణ జులై లేదా ఆగస్టులోనే పూరి చేసే ఆలోచనతో దర్శకుడు సంపత్ నంది దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.
ఇక ఈ సినిమాను సెప్టెంబర్లోనే విడుదల చేయబోతున్నారు.పవన్ వద్దన స్క్రిప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.