ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై విరుచుకుపడిన వైయస్ షర్మిల.. ?

రాజకీయాల్లో ఎదగాలంటే ప్రజల నోళ్లల్లో నిత్యం నానుతూ ఉండాలంటారు.ప్రస్తుతం వైయస్ షర్మిల గారు ఇదే సుత్రాన్ని పాటిస్తున్నట్లుగా ఉన్నారు.

 Ys Sharmila Once Again Heaped Criticism On Cm Kcr, Sharmila, Twitter, Comments,-TeluguStop.com

అవకాశం చిక్కితే చాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు.

ఇప్పటికే బీజేపీ నేత బండి సంజయ్ మరోవైపు ప్రభుత్వ విధానాలను ఎండగడుతుండగా, ఈటల మరోవైపు నుండి తనపని తాను చేసుకుంటూ పోతున్నారు.

ఇలాంటి సమయంలో వైయస్ షర్మిల కూడా వీరికి తోడవడంతో విమర్శల స్దాయి పెరిగిపోయింది.

ఇక తాజాగా కేసీఆర్ పై, ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు వైయస్ షర్మిల.కాగా కరోనా బారినపడి భయంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే వారిని అడ్దగోలుగా దోచుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీతో ప్రజల బతుకులు బజారున పడుతున్నాయని, ఇలా కేసీఆర్ దొర తన బాధ్యతను వదిలించు కోవడంతో ప్రజల మీద ప్రతి రోజు రూ.150 కోట్ల భారం పడుతోందని విమర్శించారు.బ్రతుకు మీద తీపితో అప్పులు చేస్తూ, ఉన్నదంతా అమ్ముకుంటూ కరోనా బారినుండి బయట పడాలని ఆలోచిస్తున్న వారు చివరికి మరణిస్తుండగా ఉన్నదంతా ఊడ్చేస్తున్న ప్రైవేట్ దోపిడికి బ్రతికి ఉన్న వాళ్లూ రోడ్దున పడుతున్నారంటూ ఆరోపించారు.అందుకే అయ్యా తెలంగాణ దొర కేసీఆర్ సారూ ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను కాపాడండని ట్వీట్ చేశారు వైయస్ షర్మిల.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube