తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుతం ఎంతో కొంత బలంగా ఉన్న పరిస్థితి ఉంది.రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా లేనటువంటి పరిస్థితి.
దీంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించిన విషయం తెల్సిందే.ఇక అప్పటి నుండి తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే రేవంత్ సంచలన ఆరోపణలకు మారు పేరు.తన ఆరోపణలలో ఎంత వరకు నిజాలు ఉంటాయనే విషయం పక్కకు పెడితే ఏకంగా పార్టీ అధ్యక్షులపై అసలు ఎవ్వరూ ఊహించని, ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యే ఆరోపణలు చేసిన చేస్తున్న పరిస్థితి కూడా ఉంది.
తాజాగా ముఖ్యమంత్రి కెసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేసి రహస్యంగా నా ఫోన్ సంభాషణలను వింటున్నాడని సంచలన ఆరోపణలు చేసి ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది.దీనిపై పెద్దగా టీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదు.
అయితే ఇక రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఇలాంటి సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచి కాంగ్రెస్ పార్టీని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్ళే వ్యూహం రేవంత్ ప్రయోగిస్తున్నట్టు ప్రస్ఫుటంగా అర్ధమవుతున్న పరిస్థితి ఉంది.ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న ఛాలెంజ్ కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుక రావడం.
కానీ ఇది అంత సులభమైన పని కాదని మనకు తెలుసు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో సీనియర్ లకు, రేవంత్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇవన్నీ సద్దుమణిగితే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.ఏది ఏమయినా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.