టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్( Vijay devarakonda,Purijaganath ) కాంబినేషన్ లో గత ఏడాది విడుదలైన సినిమా లైగర్( Liger movie ).భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ సినిమాకు సంబంధించిన వివాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
ఎగ్జిబిటర్లు బయ్యర్లు సినిమా వల్ల భారీగా నష్టపోయాము నష్టపరిహారం చెల్లించాలి అంటూ హైదరాబాదులోని ఫిలింనగర్ ముందు టెంటు వేసే నాన్న రచ్చ చేసిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై వరంగల్ శ్రీను( Warangal srinu ) స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వరంగల్ శ్రీను నైజాం లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయగా ఆయనకు కూడా ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వరంగల్ శ్రీను మాట్లాడుతూ.
నాకు పర్సనల్ గా పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. క్లైమాక్స్ సీన్ మినహా లైగర్ మూవీ అంత నాకు బాగా నచ్చింది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాకు వచ్చిన ఓవర్ ఫ్లోర్స్ ను నేను పూరి జగన్నాథ్ కు ఇచ్చాను.ఇస్మార్ట్ శంకర్ సినిమా వల్ల వచ్చిన లాభాలతో పోలిస్తే లైగర్ సినిమాకు వచ్చిన నష్టాలు ఎక్కువ అని చెప్పుకొచ్చారు వరంగల్ శ్రీను.లైగర్ సినిమా విడుదల తర్వాత పూరి జగన్నాథ్, చార్మి లతో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాను కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు.ఎవరైనా బ్రతికేది పరువు కోసమే.
నాకు కూడా పరువు ఉంటుంది అని వరంగల్ శ్రీను చెప్పుకొచ్చారు.ప్రస్తుతం జరుగుతున్న ధర్నాలకు వాట్సాప్ గ్రూపుల్లో గతంలో వైరల్ అయిన మెసేజ్ లకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు వరంగల్ శ్రీను.