ఈ కరోనా వచ్చినప్పటి నుంచి పెండ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.చాలామంది ఆర్భాటాలకు, ఆచార సాంప్రదాయాలకు పోకుండా సింపుల్ గా పెండ్లిచేసుకుంటున్నారు.
ఎందుకంటే అసలే కరోనా సమయం.ఇలాంటి టైమ్లో ఆచారాలకు పోతే కరోనాను కొని తెచ్చుకున్నట్టే అవుతోంది.
మళ్లీ అసలే పనుల్లేక, పైసల్లేక ఇబ్బంది పడుతున్న కాలం కాబట్టి ఎక్కువగా సింపుల్ గానే పెండ్లి చేసుకుంటున్నారు.కానీ కొన్ని కులాల్లో మాత్రం నేటికీ వారి తాతల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలను ఫాలో అవుతున్నారు.
ఏపీలోని బుడగ జంగాల్లో ఓ వింత ఆచారం ఉంది.
వారి కులంలో అమ్మాయికి కన్యాశుల్కం ఇస్తారు.
పెండ్లి సమయంలో అమ్మాయికి అబ్బాయి ఎదురు కట్నంగా 9రూపాయలు ఇస్తాడు.అందులో 4రూపాయలు అమ్మాయికి, మిగతా ఐదు రూపాయలు భవిష్కత్ లో సమస్య వస్తే పరిష్కరించడానికి కుల పెద్దలకు ఇస్తారు.
ఇందులో ఓ వింత ఆచారం కూడా ఉంది.
ఒకవేళ భార్యభర్తలు విడిపోవాలంటే మాత్రం భార్యా, భర్త, కులపెద్ద, అమ్మాయి తల్లి సమీపంలోని ఓ చెట్టు వెనకాలకు వెళ్తారు.
అక్కడ అమ్మాయి భర్త మొహంపై ఊస్తుంది.ఆ తర్వాత అబ్బాయి తన స్థోమతను బట్టి ఎంతో కొంత భార్య చీర కొంగులో కట్టి ఎడమ చేత్తో తాళిని తెంచేస్తాడు.
దాంతో వారిద్దరూ భార్య, భర్తలుగా విడిపోయినట్టే.ఇప్పటికీ బుడ జంగాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది.
రాయలసీమలో 45 వేల కుటుంబాలు ఉన్నాయి.వీరు చాలా వరకు అక్షరాస్యతకు దూరంగ ఉంటున్నారు.
ఒక్క కర్నూలు లోనే దాదాపు 27వేల కుటుంబాల వరకు ఉంటున్నాయి.వీరి జనాభానే రాయలసీమలో అధికంగా ఉంటోంది.
అయితే వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో ఉద్యమిస్తున్నారు.మరి వీరి ఉద్యమం ముందు ముందు ఫలిస్తుందోలేదో చూడాలి.