ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి.ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తిని చూపించడం లేదు.
ఓటీటీ లకే పరిమితం అవుతుండడంతో టీఆర్పి రేటింగ్స్ కూడా తగ్గిపోతున్నాయి.ఒకప్పట్లా ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్( TRP Ratings ) భారీగా రావడం లేదు.
అయితే మరి టాలీవుడ్ లో టాప్ 10లో నిలిచిన టిఆర్పీ సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో( Ala Vaikhuntapuramulo ) సినిమాకు మొదటిసారి టీవీలో ఏకంగా 29.4 రేటింగ్ వచ్చింది.ఇప్పటి వరకు టాప్ రేటింగ్ అయితే ఇదే.దీన్ని బీట్ చేసే సినిమా రెండేళ్లుగా రాలేదు.
అలాగే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా 2020లో విడుదల అయ్యి టీవీలో 23.5 రేటింగ్ ను సాధించింది.అలాగే ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2( Baahubali 2 ) సినిమాకు అప్పట్లోనే టీవీలో తక్కువ రేటింగ్ వచ్చింది.
అందుకు గల కారణం ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు చూడడమే.ఈ మూవీకి 22.7 టిఆర్పీ మాత్రమే వచ్చింది.అలాగే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఎన్నిసార్లు టీవీలో వేసినా కూడా మంచి రేటింగ్ వస్తుంది.ఈ సినిమాకు ఆ మధ్య 22.54 రేటింగ్ వచ్చింది.అది కూడా మొదటిసారి కాదు రెండు మూడు సార్లు టీవీలో వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ ఈ సినిమాను బాగానే ఆదరిస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా( Pushpa Movie ) థియేటర్స్లో విడుదలైన మూడు వారాలకే ఓటిటిలో వచ్చేసింది.దాంతో టీవీలో వచ్చినా పెద్దగా ఫలితం చూపించలేదు.కేవలం 22.54 రేటింగ్తోనే సరిపెట్టుకుంది.అల్లు అర్జున్ నటించిన మరో సినిమా దువ్వాడ జగన్నాథం.
డిజే టిఆర్పీ కూడా టాప్ 10లో ఉంది.హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ టీవీలో బాగానే ఆడింది.దీనికి 21.7 రేటింగ్ వచ్చింది.
ప్రభాస్ నటించిన బాహుబలి 1 సినిమాకు అప్పట్లో రికార్డు టిఆర్పీ వచ్చింది.థియేటర్స్లో అంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా దీనికి టీవీలో 21.54 రేటింగ్ వచ్చింది.సాయి పల్లవి వరుణ్ తేజ్ కలిసిన నటించిన ఫిదా సినిమాకు( Fida Movie ) 21.31 రేటింగ్ వచ్చింది.అలాగే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం సినిమాకు 20.8 రేటింగ్ వచ్చింది.దాంతో ఈ మూవీ టాప్ 9లో నిలిచింది.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్గణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ( RRR ) తొలిసారిగా 19.62 రేటింగ్ సాధించింది.