ప్రపంచం లోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చాక ఎక్కువగా అమెరికా దేశాన్ని వైరస్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.అప్పట్లో అమెరికాలో నమోదైన కేసులు మరణాలు బట్టి .
అంతర్జాతీయ మీడియాలో అమెరికా ప్రపంచ పటంలో ఇంకా ఉండే ఛాన్స్ లేదు అన్న తరహాలో వార్తలు వచ్చాయి.వైరస్ భయంకరంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అప్పట్లో ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయడం జరిగింది.
వైట్ హౌస్ లో పనిచేసే ప్రతి అధికారి మాస్కు తప్పని సరిగా ధరించాలి అనే నిబంధనలు తీసుకొచ్చారు.
అయితే తాజాగా అమెరికాలో కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు దాదాపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరగడంతో వైట్ హౌస్ లో కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కరోనా నిబంధనలు ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో వైట్ హౌస్ అధికారులు మాస్కులు లేకుండా కనిపించారు.అదేవిధంగా దేశ అధ్యక్షుడు జో బైడెన్, ఉపాద్యక్షురాలు కమలా హ్యారిస్తో సహా అందరూ మాస్క్ లను పక్కన పెట్టి అప్పట్లో మాదిరిగా షేక్ హ్యాండ్ .ఒకరిని ఒకరు కౌగలించుకుని విష్ చేస్తున్నారు.ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్స్ వంటివి పాటించకుండా.
గతంలో మాదిరి పరిస్థితులు తీసుకొచ్చారు.మీడియా సమావేశాల సమయంలో జర్నలిస్టులకు విధించిన నిబంధనలు కూడా ఎత్తివేశారు.