ఆ ముగ్గురిపై విచారణ చేయండి

తండ్రీకొడుకులు, మేనల్లుడిపై విచారణ చేయాలని టీటీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు.వీళ్లెవరో తెలుసుగా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుమారుడు ప్లస్‌ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, మేనల్లుడు కమ్‌ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు.ఈ ముగ్గురి కార్యకలాపాలపై విచారణ చేయాలని దయాకర్‌రావు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ ముగ్గురు గత ఆరు నెలలుగా టీడీపీ నాయకులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణలో టీడీపీని తుడిచిపెట్టాలని ఈ ముగ్గురు ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ చర్యలపై విచారణ చేయాలని అన్నారు.నోటుకు ఓటు వివాదం ముదురుపాకాన పడటంతో దిక్కుతోచని టీడీపీ నాయకులు రోజుకో డిమాండ్‌ చేస్తున్నారు.

 T Tdp Leader Demands Inquiry-TeluguStop.com

టీడీపీని తుడిచిపెట్టాలనే ప్రయత్నాలపై ఎవరు విచారణ చేయాలి? దయాకర్‌రావు ఎవరిని కోరుతున్నారు? ప్రస్తుత పరిస్థితిలో టీడీపీవారు ఎంత గగ్గోలు పెట్టినా, ఎన్ని డిమాండ్లు చేసినా అదంతా అరణ్యరోదనే.అధినేత చంద్రబాబు నాయుడే ఇరుకున పడిన నేపథ్యంలో మిగతా వారి గురించి ఎవరు పట్టించుకుంటారు.

కేసీఆర్‌ను ఎలా దెబ్బ కొట్టాలా అని టీడీపీ నాయకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.అందుకే విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.కేసీఆర్‌ చేయాల్సిన పనులు రహస్యంగా చేసుకుంటున్నారు.కాబట్టి దొరకడం కష్టం.

టీడీపీ నాయకులు కూడా రహస్యంగా చేసుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube