తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పార్టీ తన ప్రస్తానం మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది.ఇందులో భాగంగా ఇతర పార్టీలలో చేసిన వారిని తన పార్టీలోకి తీసుకొని వారితో రాజకీయం నడిపిస్తుంది.
ఏపీలో ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టి టీడీపీ పార్టీని భూస్థాపితం చేసి ఆ స్థానంలోకి తాను వెళ్లాలని చూస్తుంది.ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అటు కాంగ్రెస్ కాని, ఇటు బీజేపీ గాని బలమైన ప్రత్యర్ధులుగా లేరు.
అయితే బీజేపీ ఆరు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాస్తా సత్తా చాటింది.కాంగ్రెస్ కంటే మెరుగైన ఓటింగ్ ని సంపాదించుకుంది.
ఈ నేపధ్యంలో తెలంగాణ మీద ఫోకస్ పెట్టిన బీజేపీ పార్టీ ఇక్కడ ఇలా అయిన రాబోయే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా ఎదగాలని చూస్తుంది.ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా చేసిన వారిని తన వైపుకి లాక్కుంది.
ఇక ఇప్పుడు కేసీఆర్ కి పోటీగా నాయకుడుని తయారు చేయడం మీద ద్రుస్తిపెట్టిన బీజేపీ అందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.అందులో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్ గా మహిళా నేతని తెర మీదకి తీసుకొచ్చినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
కాంగ్రెస్ లో మంత్రిగా పని చేసిన డీకే అరుణని ముందుకి తీసుకొచ్చి ఆమెని అధ్యక్షురాలిగా చేయడం ద్వారా రానున్న ఎన్నికలకి ఆమెని లీడర్ గా ఫోకస్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.అందుకు తగ్గట్లే ఈ మధ్య కాలంలో డీకే అరుణ బీజేపీ వాయిస్ ని తెలంగాణలో బలంగా వినిపించడంతో పాటు కేసీఆర్ పాలన మీద నిప్పులు చేరుగుతుంది.
ఇక త్వరలో బీజేపీ ఆమె నాయకత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.