తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మంత్రి కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మంగళవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొడాలి నాని అంటే ఏంటో అందరికీ తెలుసునని అన్నారు.
ఆయన మాట్లాడే భాష, తీరు చేస్తుంటే రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయా? అంటూ మంత్రిని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారని అన్నారు.
చంద్రబాబు లాంటి వ్యక్తిపై అలా మాట్లాడటం సరికాదన్నారు.
కొడాలి నానికి ఆయన భాషలో చెబితేనే అర్థమవుతుందన్నారు.‘‘కొడాలి నాని మనిషి కాదు.
మృగం.కుక్క.
అప్పుడు మేం ఏంచేయాలంటే గర్జించాలి’’ అని బుద్దా వెంకన్న అన్నారు.ఇక్కడ ప్రజలు తన వ్యాఖ్యలను అర్ధం చేసుకోవాలన్నారు.
మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై తాము నిన్న ప్రెస్ మీట్ పెట్టామని బుద్దా వెంకన్న అన్నారు.వెంటనే పోలీసులు తన ఇంటికి వచ్చి తనను స్టేషన్కు తీసుకువెళ్లారన్నారు.
మళ్లీ సాయంత్రం కొడాలి నాని మీడియా సమావేశంలో చంద్రబాబు, టీడీపీ నేతలను తిట్టడం మొదలెట్టారని, ఆయనను ఎందుకు పోలీసులు అరెస్టు చేయలేదని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.