తెలుగుదేశం పార్టీ లో ప్రస్తుతం నాయకుల కొరత కనిపిస్తూ ఉన్నట్టు ఉంది.స్వయంగా అధినేత చంద్రబాబు ఎవరైనా సరే టీడీపీ లో చేరిపొండి ఎవ్వరినీ ఒదలం ఎక్కడో అక్కడ దూర్చేస్తాం అంటూ సంకేతాలు పంపిస్తున్నారు.
చిన్న చిన్న గొడవలున్నాసరే, అధినేత హుకూం జారీ చేశాక.తమకు నచ్చనివారినైనాసరే, నవ్వుతూ ఆహ్వానించేయాల్సి వస్తోంది టీడీపీ నేతలకి.
ఆనం బ్రదర్స్ లాంటి వారే ఇప్పుడు టీడీపీ లీడర్ లు అయ్యారు, కొణతాల రామ కృష్ణ దాదాపు జేరినట్టే ఇక తరవాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ అధిష్టానం ముహూర్తం నిర్ణయించడమే తరువాయి.అని చెబుతున్నారు.
నిన్న మొన్నటిదాకా ఈ ఇద్దరు నేతలూ మీనమేషాల్లెక్కెట్టారు.
పార్టీ లో వారి చేరిక కి వ్యతిరేకంగా ఉన్న వారి ని బుజ్జగించే పని కూడా అయిపొయింది.
ఇప్పుడు కన్ను వై కా పా ఎమ్మెల్యే రోజా మీద కనిపిస్తోంది.రోజా గనక టీడీపీలో కి వచ్చేస్తే వైకాపా మహిళా విభాగం మొత్తం వీక్ అయిపోయినట్టే కదా అదీ వారి ప్లాన్ కావచ్చు.
రోజాకి వల వేస్తున్నారు టీడీపీ వారు అని మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం.
చిత్తూరు కి చెందిన ఒక ప్రముఖ నేత ద్వారా ఇదంతా జరుగుతోంది.’పచ్చ’ మీడియాకి సంబంధించిన ఓ అధినేత రోజాని, ‘టీడీపీలోకి వెళ్ళిపోవచ్చుగా.’ అని ఉచిత సలహా కూడా ఇచ్చేశారు.‘అలా చేస్తే, మీపై సస్పెన్షన్కూడా ఎత్తివేయొచ్చు.మీకు మంత్రి పదవి కూడా దక్కొచ్చు.’ అంటూ సదరు మీడియా సంస్థ అధినేత, రోజాకి బంపర్ఆఫర్ఇచ్చారనీ ఈ సలహా వెనక చంద్రబాబు సూచన ఉంది అనీ అంటున్నారు.కానీ రోజా మాత్రం గట్టిగానే ఉంది.