బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పూత్ మృతిపై పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో మీడియా మరియు ఆయన అభిమానుల దృష్టి ఆకర్షిస్తూ ఉంది.సుశాంత్ ఆత్మహత్యకు కారణం బాలీవుడ్ మాఫియా అంటూ గత కొన్ని రోజులుగా కంగనా తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
ముఖ్యంగా ముగ్గురు నలుగురు బాలీవుడ్ ప్రముఖులపై ఆమె చేసిన ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి.వారి వల్లే సుశాంత్ చనిపోయాడు అంటూ పోలీసులను కూడా నమ్మించేందుకు ఆమె ప్రయత్నం చేసింది.
ఆమె చేసిన ఆరోపణల కారణంగా కొందరు సినీ ప్రముఖులను పోలీసులు ఎంక్వౌరీ చేశారు.ఇప్పుడు సుశాంత్ తండ్రి స్వయంగా పోలీసుల ముందుకు వెళ్లి తన కొడుకు ఆత్మహత్యకు రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులు కారణం అయ్యి ఉంటారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెపై మొత్తం టార్గెట్ అయ్యింది.
ఇదే సమయంలో రియా చక్రవర్తి సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ ముందస్తు బెయిల్ను తీసుకోవడం చర్చనీయాంశంగా ఉంది.
ఈ కేసులో స్వయంగా బాధితుడు తన కొడుకు మృతికి సినీ ప్రముఖులు ఎవరు కారణం కారు, కేవలం రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యులు అంటూ చెప్పాడు.
కనుక ఇన్ని రోజులు పోలీసులను మరియు మీడియాను జనాలను కంగనా తప్పుదోవ పట్టించిందని, కీలకమైన కేసు ఆమె వల్ల ఇన్ని రోజులు తప్పుదారి పట్టడం వల్ల ఆమెను నేరస్తురాలిగా భావిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.అందుకు శిక్షగా ఆమెను అరెస్ట్ చేస్తారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.