కోవిడ్ ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ పై అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.ఈ క్రమంలో కేంద్రం ఆదేశాలతో కోవిడ్ కట్టడి సన్నద్ధతపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే అన్ని ఎయిర్ పోర్టులలో విదేశీ ప్రయాణికుల శాంపిల్స్ ను సేకరిస్తున్నారు.ఈ శాంపిల్స్ ను వైద్యాధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నారు.మరోవైపు దేశవ్యాప్తంగా 50 లాబ్ లలో కొత్త వేరియంట్ల గుర్తింపుపై పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే.