బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ హాలీవుడ్ స్థాయికి పెంచేసిన దర్శక దిగ్గజం రాజమౌళి.ఇండియాలో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా రాజమౌళి బాహుబలి సినిమా స్టామినాతో పాటు అతని మార్కెట్ స్ట్రాటజీకూడా ఉందని చెప్పాలి.
ఆ సినిమా తర్వాత ఇండియాలో ఇంకా ఏ సినిమా కూడా ఆ స్థాయిలో కలెక్షన్స్ సాధించలేకపోయింది.భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తీసిన రోబో సీక్వెల్ కూడా కనీసం వెయ్యి కోట్ల దగ్గరకి కూడా రాలేకపోయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి రామ్ చరణ్, ఎన్ఠీఆర్ లతో కలిసి భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
స్వాతంత్ర ఉద్యమ నేపధ్యంలో ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి ఏకంగా ముగ్గురు హాలీవుడ్ నటుల్ని ఎంపిక చేసాడు.
హాలీవుడ్ లో స్టార్ నటులుగా ఉన్న వారిని ఇండియన్ సినిమా కోసం తీసుకోవడం ఓ విధంగా సంచలనమనే చెప్పాలి.ఇక సినిమా కథాంశం అంతా ఆంగ్లో-ఇండియన్ నేపధ్యంలో నడుస్తుంది కాబట్టి దీనిని హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక దీని కోసం జక్కన్న ఓ ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో ఒప్పందం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలంటే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఒక ఆంగ్లో-ఇండియన్ మూవీగా రిలీజ్ చేస్తే బాగుంటుందని భావించి ఈ విధంగా ప్లాన్ చేసినట్లు ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు.
మరి ఇందులో వాస్తవం ఎంత అనేది రాజమౌళి అధికారికంగా కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి చూడాలి.