రియల్ హీరో సోనూసూద్ పేరు తెలియని వారుండరని చెప్పవచ్చు.మొదటి దశ కరోనా, రెండో దశ కరోనా విజ్రుంభిస్తున్న తరుణంలో మొదటి దశలో కరోనా విజ్రుంభిస్తున్న దశలో వలస కార్మికులకు స్వయంగా స్వంత ఖర్చులతో బస్సులు వేయటం మొదలు, రెండో దశ కరోనా వేవ్ లో ఆక్సీజన్ సిలిండర్ లు తెప్పించడం, ఇటు సామాన్యులు మొదలు సెలెబ్రెటీలు సైతం సోనూసూద్ సహాయాన్ని కోరిన వారిలో ఉన్నారు.
ఇక అడిగిందే తడవుగా తనకు సాధ్యమైనంత మేర సహాయం చేసి ఎన్నో కుటుంబాలకు దేవుడిగా మారాడు.ఇక తాజాగా మరో సారి మానవత్వం చాటుకొని మరొక్క సారి ఆ సదరు కుటుంబం పట్ల దేవుడిగా మారాడు.
ఇక అసలు విషయం లోకి వెళ్తే ఓ కుటుంబం తన తమ్ముని ఊపిరితిత్తుల మార్పిడికి సంబంధించి తమ శక్తికి మించి ఖర్చు చేసినా ఇంకా కోటి యాభై లక్షలు అవసరం ఉండటంతో చివరి అవకాశంగా సోనూసూద్ ను సంప్రదించారు.
ఇక వారి ట్వీట్ కు స్పందించిన సోనూసూద్ ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించి అంతేకాక ఖర్చును మొత్తం భరిస్తానని హామీ ఇచ్చారు.ఇక సోనూసూద్ హామీతో ఆ కుటుంబం సంతోషించారు.ఇక అంతేకాక ఈ సమయంలో భారతీయులందరి సపోర్ట్ కావాలని శక్తికి మించి ప్రయత్నిద్దామని సోనూసూద్ తెలపడం విశేషం.