కొంతమంది హీరో హీరోయిన్లు వచ్చీరావడంతోనే సినిమా ఇండస్ట్రీలో తమ ప్రతిభను నిరూపించుకోవడంతో సినీ ప్రేక్షకులకి బాగానే దగ్గర అవుతుంటారు.కానీ తమ వైవాహిక జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఉన్నఫలంగా సినిమా ఇండస్ట్రీ ని వదిలిపెట్టి వెళ్లిపోయిన నటీనటులు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.
ఒకప్పటి హీరోయిన్ లయ కూడా ఈ కోవకే చెందుతుంది.తెలుగులో 1999వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు కె.
విజయ భాస్కర్ మరియు తెలుగు ప్రముఖ హీరో తొట్టెంపూడి వేణు కాంబినేషన్ లో తెరకెక్కిన స్వయంవరం అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది బ్యూటిఫుల్ హీరోయిన్ లయ.
అయితే నటి లయ వచ్చి రావడంతోనే తన ప్రతిభను నిరూపించుకోవడంతో వరుసగా జగపతి బాబు, నందమూరి బాలకృష్ణ, శివాజీ, జె .డి చక్రవర్తి, తదితర స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుని అతికొద్ది సమయంలోనే స్టార్ డమ్ ని దక్కించుకుంది.ఈ క్రమంలో దాదాపుగా 30 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి బాగానే ఆకట్టుకుంది.
అయితే 2006 వ సంవత్సరంలో అమెరికాలో సెటిల్ అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త ఉద్యోగి గణేష్ గోర్తి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత పలు అడపాదడపా చిత్రాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆకట్టుకోలేకపోయింది.
దీంతో ప్రస్తుతం నటి లయ తన భర్తతో కలిసి యునైటెడ్ స్టేట్స్ లో ఉంటోంది.అలాగే సినిమాలో కూడా అంత పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు లయ .
అయితే సినిమా నటనకి గుడ్ బై చెప్పినప్పటికీ నటి లయ సోషల్ మీడియాలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకి సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.అయితే తాజాగా నటి లయ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఇందులో నటి లయ తన స్నేహితురాళ్లతో కలిసి యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ఓ ప్రముఖ పార్క్ లో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.దీంతో కొందరు నెటిజన్లు నటి లయ లేటెస్ట్ ఫోటోలు చూసి ఫిదా అయ్యారు.
ఈ క్రమంలో కొందరు ఏకంగా నటి లయ కి 40 సంవత్సరాల వయసు పైబడినప్పటికీ ఇప్పటికీ చాలా యంగ్ గా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇలా ఉండగా పెళ్లయిన తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చివరిగా బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు అనంతరం ఆ మధ్య టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో హీరో చిన్నప్పటి తల్లి పాత్రలో కనిపించి తళుక్కున మెరిసింది.దీంతో మళ్లీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారు.కానీ ఈ చిత్రంలో నటించిన తర్వాత మళ్ళీ లయ సినిమా ఇండస్ట్రీ పై పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.అందువల్లనే ఆ మధ్య తెలుగు ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం వరించినప్పటికీ సున్నితంగా తిరస్కరించిందని కొందరు చర్చించుకుంటున్నారు.