ఏదైనా పండుగ వస్తుందంటే చాలు ఆన్లైన్ యాప్లు లేదా ఇతర కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడం చాలా కామన్.అయితే ఈ సారి మాత్రం మన ప్రభుత్వ రంగంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ రాఖీ పండుగను పురస్కరించుకుని బంపర్ ఆఫర్ను తీసుకొచ్చింది.
అయితే ఇది కాస్తా బ్యాంకులో కాకుండా ఆన్లైన్ కోనుగోళ్లపై ఆఫర్లు ప్రకటించింది.అదెలా అంటే ఎస్బీఐ యాప్ అయిన యోనో ద్వారా ఈ పండుగ సందర్భంగా ఎవరైతే షాపింగ్ లు చేసి బిల్లలు చెల్లిస్తారో వారికి ప్రతి కొనుగోలుపై ఏకంగా 20 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించేసింది.
ఇక పోయినేడాది కరోనా కారణంగా ఎలాంటి ఆఫర్లు ప్రకటించలేదని, కానీ ఈ సారిమాత్రం కొంచెం పరిస్థితులు అనుకూలించడంతో పండుగ సందర్భంగా ప్రజలుు కూడా షాకింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఇక దీన్నే అలుసుగా చేసుకున్న ఎస్బీఐ కొత్త ఆఫర్లకు తెర లేపింది.
ఇక ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ప్రజలందరూ కూడా మార్కెట్లకు వెళ్లకుండా ఆన్లైన్ షాపింగ్పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారన్న విషయం తెలిసిందే.ఇదే అదునుగా కస్టమర్లను శ్రేయస్సు, అలాగే సంస్థ లాభాన్ని ఆశిస్తూ ఎస్బీఐ కూడా ఆన్లైన్ షాపింగ్నే ప్రోత్సహించడానికి రెడీ అయింది.
ఇక ఇప్పుడు ఎస్బిఐ ప్రకటన తీసుకొచ్చిన దాని ప్రకారం అయితే ఫెర్న్స్ యాంట్ పెటల్స్ కంపెనీ కస్టమర్లకు బహుమతి కొనుగోలు చేస్తే 20 శాతం వరకు రాయితీలు ఇచ్చేందుకు రెడీ అయింది.కాగా ఇక్కడ ఓ కండీషన్ కూడా ఉంటుంది.అదేంటంటే ఈ ఆఫర్ పొందాంలటే కచ్చితంగా రూ .999 వరకు షాపింగ్ చేస్తేనే ఇది వర్తిస్తుంది.అలాగే కచ్చితంగా వినియోగదారులు SBI యోనో యాప్లో మాత్రమే షాపింగ్ చేస్తే ఈ ఆఫర్ ఉంటుంది.లేదంటే లేదు.ఇక ఎస్బీఐ యోనో యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు sbiyono.sbi/index.html లింక్ను వాడాలని ఎస్బీఐ వివరించింది.ఇక ఈ ఆఫర్ ఆగస్టు 22 వరకే ఉంది.