పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ప్రభాస్ ను వెండి తెర మీద చూడక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.
అందుకే రాధేశ్యామ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రమోషన్స్ పరంగా వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేసింది.ఇక ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు మేకర్స్.
ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేస్తున్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలను చెబుతూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు.
ఈ క్రమంలో ప్రభాస్ తన సెంటిమెంట్ గురించి చెప్పుకొచ్చాడు.
రాధేశ్యామ్ సినిమాలో సత్యరాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.సత్యరాజ్ తన సెంటిమెంట్ అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.‘సత్యరాజ్ సార్ నా లక్కీ మస్కట్’.నేను ఆయనతో కలిసి చేసిన మిర్చి, బాహుబలి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.రాధేశ్యామ్ కూడా మా కెరీర్ లో మరొక మైలురాయిలా నిలిచి పోతుంది అని ప్రభాస్ నమ్మకంగా చెప్పాడు.
అలాగే రాధేశ్యామ్ సినిమాలో సత్యరాజ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండడమే కాకుండా ఇంట్రెస్ట్ గా కూడా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.
ఇటలీలో 1970ల నాటి నేపథ్యంలో కొనసాగే కథతో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్ గా నటించాడు.ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.
మరొక వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.చూడాలి మరి ప్రభాస్ సెంటిమెంట్ నిజం అవుతుందో లేదో.