ఒకప్పుడు హీరోయిన్ రాధ, చిరంజీవి కలసి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీని అప్పట్లో ఒక ఊపు ఊపేసిన క్రేజీ కాంబినేషన్ అని చెప్పవచ్చు.
హీరోయిన్ రాధ( Heroine Radha ) ఒకప్పుడు మెగాస్టార్ తో పోటీపడి మరి స్టెప్పులు వేసి నటించింది.అప్పట్లో ఈ జంట తెరపై కనిపించింది అంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు.
ఈ జంట ఎవరు గ్రీన్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.రాధ ఈరోజు చిరంజీవితో పాటుగా ఇంకా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ చిరంజీవితో( Chiranjeevi ) నటించిన సినిమాలు ఆమెకు మరింత గుర్తింపును క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.
ఇక ఆ తర్వాత కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాధ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ దూరం అయింది.ఇటీవలే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది.అప్పుడప్పుడు తనదైన శైలిలో కామెడీ చేస్తూ డాన్సులు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది రాధ.ఇది ఇలా ఉంటే రాధా ప్రస్తుతం ప్రముఖ రియాలిటీ షో నీతోనే డాన్స్ షోకి( Neethone Dance Show ) జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ షోకి యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) హాజరయ్యారు.
సాయి ధరంతేజ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా బ్రో.( Bro Movie ) ఈ సినిమా ఈనెల 28న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ షోకి హాజరైన సాయి ధరమ్ తేజ్ ఆడుతూ పాడుతూ సందడి సందడి చేశారు.ఇక సాయి ధరమ్ చేసి ఎంట్రీ ఇవ్వగానే ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటారు అని శ్రీముఖి ప్రశ్నించగా.జీవితాంతం అంటూ షాక్ ఇచ్చాడు.వెంటనే తనకు సపోర్ట్గా కామెంట్ చేస్తూ బ్రో అని సంబోధించింది సదా.
దీనికి తేజ్ మీరు బ్రో అంటే వెళ్లవయ్యా వెళ్లు అంటాం మేం కూడా అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు.అనంతరం సీనియర్ హీరోయిన్ రాధా తో కలిసి స్టెప్పులు వేశాడు సాయి ధరమ్ తేజ్.యముడికి మొగుడు సినిమాలోని అందం హిందోళం సాంగ్కి రాధ ఎనర్జిటిక్గా మూమెంట్స్ వేసి ఆశ్చర్యపరిచింది.
సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టెప్పులతో అలరించారు.ఇట్స్ లైక్ ఎ డ్రీమ్.
చిరంజీవి గారితో డ్యాన్స్ చెయ్యలేకపోయినా మీతో డ్యాన్స్ చేశాను అంటూ ఎగ్జైట్ అయ్యాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.