సౌత్ లో ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించే వారు కాదు.కాని ఇప్పుడు మాత్రం వరుసగా సౌత్ సినిమాలను చేసేందుకు బాలీవుడ్ హాట్ బ్యూటీలు సిద్దం అవుతున్నారు.
ప్రభాస్ తో సాహో లో నటించిన శ్రద్దా కపూర్ దాదాపుగా మూడు కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా పారితోషికం దక్కించుకుంటూ హీరోయిన్స్ తెలుగు లో నటిస్తున్నారు.
ముఖ్యంగా రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న ఇద్దరు హీరోయిన్స్ పారితోషికం మరో రేంజ్ లో ఉంది.సౌత్ లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్స్ తీసుకోని పారితోషికంను వారు తీసుకుంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ కు జోడీగా నటించినందుకు గాను ఆలియా భట్ కాస్త అటు ఇటుగా ఆరు కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
రాజమౌళి ఎప్పుడు డేట్లు అడిగితే అప్పుడు ఇవ్వడంతో పాటు.సినిమాలో అత్యంత కీలక సన్నివేశాలు ఆమె పై ఉన్నాయి కనుక పారితోషికంను ఎక్కువ ఇవ్వడం జరిగింది.రాజమౌళి సినిమాలో సీత పాత్రకు గాను ఆలియాను నటింపజేశాడు.
జక్కన్న రాజమౌళి ఆమెకు ఇచ్చిన పారితోషికం మేరకు పూర్తిగా న్యాయం చేసి ఉంటారు అనడంలో సందేహం లేదు.ఇక రాజమౌళి తర్వాత శంకర్ కూడా బాలీవుడ్ నుండి ఒక హీరోయిన్ ను దిగుమతి చేసుకున్నాడు.
కియారా అద్వానీ తెలుగు లో రామ్ చరణ్ కు జోడీగా శంకర్ మూవీలో నటించబోతుంది.ఆ సినిమాకు గాను నాలుగు కోట్ల పారితోషికంను తీసుకోబోతుంది.ఇక ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే సినిమాను చేస్తున్న హాట్ బ్యూటీ దీపిక పదుకునే 5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఇక్కడ కోట్లు కుమ్మరిస్తూ ఉన్నారు.