ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మితమైన హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మరో అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా నిలిచింది.2021 సంవత్సరానికి గాను అంతర్జాతీయ స్కైట్రాక్స్ అవార్డుని కైవసం చేసుకుంది శంషాబాద్ ఎయిర్ పోర్ట్.శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు ఈ అవార్డ్ వరుసగా మూడవసారి దక్కడం విశేషం.విమానాశ్రయం గురించి ప్రయాణీకుల అభిప్రాయాలు స్కైట్రాక్స్ సంస్థ తీసుకుంటుంది.
వారి సంతృప్తి స్థాయిని బట్టి ఈ అవార్డులు అందిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న 550 విమానాశ్రయాల్లో ప్రయాణీకుల అభిప్రాయాలను తీసుకున్నారు.
కరోనా టైం లో శంషాబాద్ వినామాశ్రయం ఆధినిక సాంకేతికతో తమ సేవలను అందించారు.అందుకే ఈ పురస్కారం అందుకుందని జి.ఎం.ఆర్ గ్రూప్ వెళ్లడించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ స్కైట్రాక్స్ అవార్డుల్లో టాప్ 100 విమానాశ్రయాల జాబితాలో 64వ స్థానం దక్కించుకుంది.అంతకుముందు ఈ ఎయిర్ పోర్ట్ 71వ స్థానంలో ఉండేది.
లేటెస్ట్ గా ఏడు స్థానాలు ముందుకు వచ్చింద్ది.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను జి.ఎం.ఆర్ గ్రూప్ పర్యవేక్షణలో ఉందన్న విషయం తెలిసిందే. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఈ అవార్డ్ రావడం పట్ల అధికారులు అంతా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.