ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమాతో బిజీగా ఉన్న ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
(SSMB 28) అనే వర్కింగ్ టైటిల్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా పూజా హెగ్డే మరియు .పూజా హెగ్డే మహేష్ బాబు కలయికలో మొదటి సినిమా మహర్షి.మహేష్ బాబు-పూజా హెగ్డే కాంభినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది.అంతేకాదు ‘అతడు, ఖాలేజ‘ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.నిజానికి ఈ సినిమాలో నటించేందుకు పూజా హెగ్డే వద్ద డేట్లు ఖాళీ లేవు.కానీ అరవింద సమేత, అలా వైకుంఠపురం లో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా సినిమా మిస్ చేసుకోకూడదని పూజా హెగ్డే స్వయంగా తన డేట్స్ అడ్జస్ట్ మెంట్ చేసుకుని మరీ సినిమా కోసం సైన్ చేసిందట.
అందువల్ల ఈ సినిమాలో పూజకి బోలెడు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.పూజా హెగ్డే ఒక్కో సినిమాకి 2 కోట్లు మాత్రమే ఛార్జ్ చేస్తుంది.కానీ ఈ సినిమా నిర్మాతలు మాత్రం పూజా హెగ్డే కు దాదాపు 3 కోట్లు వరకు ఇస్తున్నట్లు సమాచారం.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.