సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు కొదవ లేదు.రోజుకో ఫేక్ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంటుంది.
ఇంకా వాట్సాప్ లో అయితే అసలు బ్రేక్ లేదు.వార్త బాగుండి.
కాస్త దైవంకు సంబంధించినది అయితే షేర్లపైనా షేర్లు చేస్తుంటారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ గాలి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అది ఏంటంటే? ”దేశ చరిత్రలోనే తొలిసారిగా లక్ష లింగాల పుణ్యక్షేత్రం బయటపడింది.కర్ణాటకలోని శివకాశీ నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో ఈ లింగాలు దర్శనమిచ్చాయి.
మన సనాతన సంస్కృతికి ఇవే రుజువు.హిందువులారా మేల్కొనండి, హిందువులమని గర్వించడి” అంటూ ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కానీ నిజానికి కర్ణాటకలోని సిర్సి తాలూకాలో దట్టమైన అడవిలో ఉండే ఈ నదిని 2011లోనే పర్యావరణ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఈ ప్రాంతం గురించి అప్పుడే ప్రపంచానికి తెలియజేశారు.
ఇంకా అందులో పదులు, వందలు కాకుండా వేల సంఖ్యలో శివ లింగాలు చెక్కి ఉన్నాయి.ఆ శివలింగాలను క్రీ.శ.1678-1718 కాలంలో సిర్సి రాజు అరసప్ప నాయక్ ఈ లింగాలను చెక్కించినట్లు ఉత్తర కన్నడ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.
కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమో ఏకంగా లక్ష లింగాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.కర్ణాటకలోని షాల్మలా నదీ ప్రాంతంలో ఉన్న ఈ శివలింగాలు పర్యాటకానికి కూడా ప్రసిద్ధి చెందింది.
తొమ్మిదేళ్ల క్రితమే ఫేమస్ అయినా ప్రాంతం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు రాసి వైరల్ చేస్తున్నారు.