ఖమ్మం( Khammam ) నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామం( Chimmapudi )లో ఈ నెల 28న కోయచెలక, రేగులచెలక, కోటపాడు,చిమ్మపూడి,పాపటపల్లి,విఆర్ బంజర,జిఆర్ బంజర గ్రామాల బీఆర్ఎస్ పార్టీ( BRS party ) కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరగనుంది.ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొనున్నారు.
ఈ సందర్భంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లును మంత్రి పువ్వాడ పీఏ చిరుమామిళ్ల రవికిరణ్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం రేగులచెలక గ్రామంలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించి,కోటపాడు గ్రామంలో జరుగుతున్న శివాలయం వార్షికోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సుడా నిధుల ద్వారా కోటపాడు గ్రామంలో జరుగుతున్న ఐమాస్ లైట్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గౌరీ,వైస్ ఎంపీపీ రవి,మండల పార్టీ అధ్యక్షుడు వీరునాయక్, సర్పంచ్లు హరిప్రసాద్,రామారావు,వైస్ సర్పంచ్ వెంకటేశ్వర్లు, రైతు సమితి మండల అధ్యక్షుడు సత్యనారాయణ,మార్కెట్ డైరెక్టర్ నున్న శ్రీను,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు,నాయకులు శ్రీనివాస్,లాలు,విజయ్,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.