సూర్యాపేట జిల్లా:గత ఎన్నికల సమయంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలో పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని సోమవారం ఎక్సైజ్ ఎస్పీ ఆదేశాలతో హుజూర్ నగర్ ఎక్సైజ్ ఎస్ఐ వెన్నెల(Nagar Excise SI Vennela) ఆధ్వర్యంలో ధ్వంసం చేసినట్లు గరిడేపల్లి ఎస్ఐ చలకంటి నరేష్ (SI Chalakanti Naresh)తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల్లో 48 కేసులలో పట్టుబడిన 185 లీటర్ల మద్యం,111 లీటర్ల నాటు సారాయి గరిడేపల్లి పోలీసు స్టేషన్లో భద్రపరినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది చాగంటి నాగయ్య,రవి,బాలు,నాగరాజు,పోలీస్ సిబ్బంది నగేష్,అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.