యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో పాటుగా బుల్లితెర మీద స్పెషల్ షోస్ కూడా చేస్తున్నాడు.బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ గా అలరించిన తారక్ లేటెస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా చేస్తున్నాడు.
ఎన్.టి.ఆర్ చేస్తున్న ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా రాం చరణ్ వచ్చారు.ఇద్దరు కలిసి ఆర్.
ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.సినిమా టైం లో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడ్డది.ఈ క్రమంలో తారక్ షోలో చరణ్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు.అయితే ఈ షోలో భాగంగా చరణ్ పాతిక లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడని ఎక్స్ క్లూజివ్ న్యూస్.
ఎన్.
టి.ఆర్ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన చరణ్ పాతిక లక్షల క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడని తెలుస్తుంది.చరణ్ ను ఎక్కువగా సినిమాలకు సంబందించిన ప్రశ్నలే అడిగినట్టు తెలుస్తుంది.తారక్, చరణ్ ఇద్దరు గేం షో చాలా సరదాగా సాగిందని తెలుస్తుంది.ఆగష్టు 16న ఈ షో టెలికాస్ట్ అవుతుందని అంటున్నారు.జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో రాబోతుంది.
ట్రిపుల్ ఆర్ సినిమాలో చరణ్ రామ రాజు పాత్రలో నటిస్తుండగా.ఎన్.టి.ఆర్ కొమరం భీం గా కనిపించనున్నాడు.