లాక్డౌన్ వేళ సెలబ్రిటీలు అందరూ కూడా ఎదో ఒక ఛాలెంజ్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నారు.తాజా గా ‘బీ ద రియల్ మ్యాన్’ చాలెంజ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతోంది.
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్ను ఇప్పుడు పలువురు స్వీకరిస్తున్నారు.ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయడమే ఈ ఛాలెంజ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఇక సందీప్ నుంచి ఈ సవాల్ను స్వీకరించిన రాజమౌళి ఇంట్లో గిన్నెలు తోమి,ఇల్లు తుడిచి దానికి సంబందించిన వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, రామ్ చరణ్, ఎన్టీఆర్, సుకుమార్, శోభు యార్లగడ్డ, కీరవాణిలకు ఛాలెంజ్ విసిరారు. అయితే తాజాగా జక్కన్న విసిరిన ఆ సవాల్ను ఎన్టీఆర్ స్వీకరించి ఈరోజు ఇంట్లో గిన్నెలు తోమి, ఇల్లు తుడిచాడు.దీనికి సంబంధించిన వీడియోను అయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో అది కాస్త వైరల్ గామారింది.అంతేకాదు ఇంటి పనులు చేసిన ఎన్ఠీఆర్ బాబాయ్ బాలకృష్ణకు, చిరంజీవికి, నాగార్జునకు, వెంకటేష్ కు, కొరటాల శివలకు ఈ ఛాలెంజ్ విసిరారు.
మొత్తానికి టాలీవుడ్ లో ఈ ఛాలెంజ్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.
మొత్తానికి లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలు ఖాళీ గా ఉండకుండా ఇలా భార్యలకు సాయపడుతూ కాలక్షేపం చేస్తున్నారు.
మార్చి నుంచి అమలవుతున్న ఈ లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.దీనితో సెలబ్రిటీలు ఒకరినొకరు ఛాలెంజ్ విసురుకుంటూ సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారుతున్నారు.