కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.ఆయన నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది.
అయితే ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేని ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో షోలు క్యాన్సిల్ అయ్యాయని సమాచారం అందుతోంది.
అయితే మోహన్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువయ్యాయని మోహన్ బాబు పేర్కొన్నారు.
సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే అని చెబుతున్నారని అలా చెబుతూనే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని మోహన్ బాబు వెల్లడించారు.ఆర్టిస్టులు తీసుకునే రెమ్యునరేషన్ గురించి తాను కామెంట్ చేయనని నా గురించి తప్ప ఇతరుల గురించి తాను మాట్లాడనని మోహన్ బాబు అన్నారు.
ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు జరుగుతున్నాయని మోహన్ బాబు వెల్లడించారు.
ఎవరికి వాళ్లు గొప్ప అని భావిస్తున్నారని అయితే తన దృష్టిలో మాత్రం ఎవరూ గొప్ప కాదని మోహన్ బాబు పేర్కొన్నారు.60 రోజుల క్రితం ఏపీ ప్రభుత్వంతో టికెట్ రేట్ల గురించి మాట్లాడటానికి బహిరంగ లేఖను రిలీజ్ చేశానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.ఆ సమయంలో అందరూ బిజీగా ఉన్నారని చెప్పారని గతంలో ఏదైనా సమస్య వస్తే చర్చించుకుని పరిష్కరించుకునే వాళ్లమని మోహన్ బాబు వెల్లడించారు.
సీఎంవో నుంచి నాకు ఆహ్వానం వచ్చినా కొందరు అందకుండా చేశారని మోహన్ బాబు తెలిపారు.తనకు పిలిచినా పిలవకపోయినా తనకు విలువ, గౌరవం, చరిత్ర ఉందని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.ఎవరూ శాశ్వతం కాదని ఇతరుల మాటలను తాను పట్టించుకోనని మోహన్ బాబు కామెంట్లు చేశారు.మోహన్ బాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.