తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొంది థియేటర్లలో దూసుకుపోతోంది.
అంతేగాక ఇప్పటికే మహేష్ బాబు పలు రికార్డులను బద్దలు కొట్టి మరో బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు.
అయితే ప్రస్తుతం మహేష్ బాబుకి సంబంధించినటువంటి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఆ వార్త ఏంటంటే 2014వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అటువంటి ఆగడు చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటించాడు.అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో మహేష్ బాబు మోకాలికి చిన్నపాటి గాయం తగిలింది.
అయితే ఈ విషయం అప్పుడు పెద్దగా బాధించన ప్పటికీ ఇప్పుడు మహేష్ బాబు ని తీవ్రంగా కలవరపెడుతోందట.దీంతో ఈ విషయమై మహేష్ బాబు వైద్యులను సంప్రదించగా దీనికి చిన్నపాటి శస్త్రచికిత్స చేయాలని అంతేగాక కొంత సమయం పాటూ విశ్రాంతి కూడా అవసరమని సూచించారట.
దీంతో ప్రస్తుతం మహేష్ బాబు ఈ శస్త్రచికిత్స నిమిత్తమై అమెరికాలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో వైద్యం చేయించుకునేందుకు అమెరికాకు పయనమయ్యే పనిలో పడ్డాడు.
అయితే ఇలా ఉండగా ఇప్పటికే మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.అంతేగాక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.