ప్రొఫెసర్ల వేధింపులతో జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
తిరుపతి శివజ్యోతినగర్కు చెందిన గీతిక ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
ఆదివారం మధ్యాహ్నం తల్లితో కలిసి భోజనం చేసిన గీతిక అనంతరం తన గదిలోకి వెళ్లిపోయింది.సాయంత్రం ఆమెను నిద్ర లేపేందుకు తల్లి ప్రయత్నించగా ఎంతకూ గది తలుపులు తీయలేదు.దీంతో కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది.
పక్కింటి వారి సాయంతో గది తలుపులు తెరిచి గీతికను ప్రభుత్వ రుయా ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు.అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఎస్వీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల వేధింపుల కారణంగానే శిల్ప ఆత్మహత్య చేసుకుంది.దీంతో అప్పటి నుంచి ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
ఇంతలోనే యూనివర్సిటీలో మరో మెడికో ఆత్మహత్య కలకలం రేపుతోంది.న్యాయవాదిగా పనిచేసిన గీతిక తండ్రి విజయ్భాస్కర్ రెడ్డి ఐదేళ్ల కిందట మృతిచెందడంతో తల్లి హరితాదేవి అప్పటి నుంచి కుమార్తెను చూసుకుంటోంది.
చదువులో రాణించిన గీతిక ఎంసెట్లోనూ మంచి ర్యాంకు సాధించి ఎస్వీ వైద్యకళాశాలలో మెడిసిన్ సీటు సంపాదించింది.ఎంతో ఇష్టపడి ఎంబీబీఎస్లో చేరిన గీతిక ఇలా అర్థాంతరంగా తనువు చాలించిడం పట్ల ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
దీనికి కారణం పరీక్షల ఒత్తిడి, వ్యక్తిగత కారణాలే కారణం అని తెలిసింది.