సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.అటువంటి జర్నలిస్టులకు 200 గజాల ఇంటి స్థలాలు కేటాయించాలని మంగళవారం హుజూర్ నగర్ ఆర్డిఓకి రాసిన లేఖ ద్వారా కోరారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో పాటు జర్నలిస్టులు కూడా నిరాహార దీక్షలు,ర్యాలీలు, ధర్నాలు చేశారని గుర్తు చేశారు.తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు సకలజనులను ముందుండి నడిపించారన్నారు.
ఎండనక వాననక నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు కరోనా సమయంలో ధైర్యంగా ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని, జర్నలిస్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హుజూర్ నగర్ పట్నంలోని ఫణిగిరి గుట్ట వద్ద ప్రభుత్వ భూమిని సేకరించామన్నారు.పట్టణ, మండల జర్నలిస్టులకు 200 గజాల ఇండ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.