భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తి కోయలు కత్తులు దూశారు.చంద్రుగొండ మండలం ఎర్రబోడులో గుత్తి కోయలు ప్లాంటేషన్ మొక్కలు నరికారు.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారిపై గుత్తి కోయలు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
సెక్షన్ ఆఫీసర్ పారిపోయి పోలీసులను ఆశ్రయించారు.రక్తపు మడుగులో పడివున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ను ఆస్పత్రికి తరలించగా .ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.అయితే దాడికి పాల్పడింది ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చిన వలస గుత్తి కోయలుగా గుర్తించారు.