సుకుమార్ ప్రొడ్యూస్ చేసిన
కుమారి 21F
చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
రాజ్ తరుణ్, హెబ్బా పటేల్
హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్గా నిలిచింది.ఈ సినిమాతో హెబ్బా పటేల్ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది.ఈ సినిమాతో ఆమెను అందరూ కుమారి అని పిలవడం మొదలుపెట్టారు.
అయితే ఆ సినిమా ఇచ్చిన బూస్ట్తో వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ.ఒకటి రెండు చిత్రాలు మినహా పెద్దగా ఆమెకు ఏ సినిమా కూడా చేసిందేమీ లేదు.
దీంతో ఆమె సక్సెస్ గ్రాఫ్ అమాంతం పడిపోతూ వచ్చింది.ఇక ఇప్పుడు ఆమెకు హీరోయిన్ అవకాశాలు లేకుండా పోయినట్లు తెలుస్తోంది.
ఒకట్రెండు చిత్రాల్లో గెస్ట్ పాత్రల్లో నటించేందుకు మాత్రమే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.ఇటీవల యంగ్ హీరో
నితిన్
నటించిన
భీష్మ
చిత్రంలోనూ ఆమె కేమియో పాత్ర చేసింది.
కాగా తాజాగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో
రామ్
నటిస్తున్న
రెడ్
మూవీలో ఆమె ఓ ఐటెం సాంగ్లో చిందులు వేస్తోంది.ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ముగిసింది.
హీరోయిన్గా ఛాన్సులు లేనప్పుడు హీరోయిన్లు ఐటెం సాంగ్స్కు ఓకే చేస్తుంటారు.మరి ఈ ఐటెం సాంగ్తోనైనా ఈ బ్యూటీని ఎవరైనా పట్టించుకుంటారో లేదో చూడాలి.