విశాఖలో నలుగురు విద్యార్థినీల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది.అదృశ్యమైన విద్యార్థినీలు క్వీన్ మేరీ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్నారు.
నిన్న సాయంత్రం నుంచి నలుగురు అమ్మాయిలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలో విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
అయితే సొంత కాళ్ల మీద నిలబడేందుకు వెళ్తున్నామంటూ విద్యార్థినులు లేఖ రాశారు.తమ కోసం వెతకొద్దని లెటర్ లో పేర్కొన్నారు.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు మిస్టరీ ఛేదించే పనిలో పడ్డారు.దీనిలో భాగంగా పోలీస్, వాలంటీర్ గ్రూపుల్లో అలర్ట్ చేస్తున్నారు.