ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

 Delhi Cm Kejriwal's Letter To Pm Modi-TeluguStop.com

గత కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కేజ్రీవాల్ తెలిపారు.బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చివేయడం, విచ్ఛిన్నం చేయడం, దేశ సహకార సమాఖ్య వాదం కాదని ఆయన లేఖలో వెల్లడించారు.

ఎమ్మెల్యేలు అమ్ముడు పోకుండా ప్రభుత్వం విచ్ఛిన్నం కాకపోతే గవర్నర్ ద్వారా పాలనను అడ్డుకునేందుకు ఆర్డినెన్స్ తెచ్చారన్నారు.ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎందుకు స్తంభింప చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

ఇదేనా భారతదేశ విజన్ .? ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా అని నిలదీశారు.సహకార సమాఖ్యవాదం ఒక జోక్ గా మిగిలిపోతుందన్న కేజ్రీవాల్ అందుకే రేపటి నీతి ఆయోగ్ భేటీకి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube