గత ఏడాది ఇదే సమయంలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో మాటల్లో చెప్పలేం.ఇక అలా కొన్ని నెలలు వైరస్ ప్రభావంతో అందరూ లాక్ డౌన్ లో ఉండగా.
ఆ తర్వాత ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ను నిషేధించింది.ఇక కొన్ని జాగ్రత్తలతో ఐదు నెలలు ప్రజలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా మారగా.
ప్రస్తుతం మళ్లీ వైరస్ వణికిస్తుంది.
లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగు లన్ని ప్రారంభమవ్వగా ప్రస్తుతం కరోనా విజృంభణతో కొందరు నటీనటులు కరోనా బారిన పడుతున్నారు.
ఇప్పటికే కొందరు కరోనా నుండి బయటపడగా.మరికొంత మంది ముందు జాగ్రత్తతో వ్యాక్సిన్ ను తీసుకుంటున్నారు.మామూలుగా వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా సోకే ప్రయత్నం తక్కువగా ఉంటుంది.
కానీ వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా అది కూడా రెండు డోసులు తీసుకున్నాక కూడా వైరస్ బారిన పడ్డారు.ఇంతకీ ఆయన ఎవరో కాదు ప్రముఖ సీని నిర్మాత అల్లు అరవింద్.ముందు జాగ్రత్తతో కరోనా వ్యాక్సిన్ తీసుకోగా దానివల్ల ఎలాంటి సింప్టమ్స్ కనిపించకపోయేసరికి ఆయనకు కరోనా సోకింది.
వైరస్ సోకక ముందు అరవింద్ రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకోగా మళ్లీ పాజిటివ్ అని తేలింది.సినీ పరిశ్రమలో వ్యాక్సిన్ పని చేయని మొదటి వ్యక్తి గా అల్లు అరవింద్ కు సోకింది.
మామూలుగా వ్యాక్సిన్ వేయించుకున్నాక ఎలాంటి సింఫ్టమ్స్ కనిపించకపోతే వారిలో యాంటీబాడీస్ వృద్ధిచెందుతుందన్నట్టు అర్థం.అందుకే అల్లు అరవింద్ కి ఇలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో కరోనా బారిన పడ్డారు.
అంతే కాకుండా తాజాగా హీరోయిన్ నివేత థామస్ కూడా కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసిందే.ఇటీవల హీరో నాగార్జున కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా విషయాన్ని అందరితో పంచుకున్నాడు.