వందేళ్లుగా ప్రగతి పథంలో వెనక్కు తిరిగి చూసుకోకుండా దూసుకు పోతున్న చైనాకు కరోనా దెబ్బ గట్టిగా పడ్డది.ఇరువై ముప్పై ఏళ్లు మళ్లీ వెనక్కు వెళ్లే పరిస్థితి వచ్చింది.
టెక్నాలజీతో ఆటలాడుకునే చైనా ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది.అద్బుతమైన వైధ్య సంపధ ఉన్నట్లుగా చైనాకు గుర్తింపు ఉంది.
ఎందరో చైనా శాస్త్రవేత్తలు అద్బుతమైన ఔషదాలను ఆవిష్కరించారు.అలాంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో అర్థం అవ్వడం లేదు.
కరోనాకు మందు వారు ఎందుకు కనిపెట్టలేక పోతున్నారో తెలియడం లేదు అంటూ ప్రపంచమే నివ్వెర పోతుంది.
కరోనా వైరస్కు చైనా మందు కనిపెట్టినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
కాని వారు మాత్రం బయటకు ప్రకటించడం లేదు.ఏదైనా మెడిసిన్ కనిపెట్టినప్పుడు కనీసం సంవత్సరం పాటు దాన్ని అబ్జర్వేషన్లో పెట్టాలి.
మొదట జంతువులపై ఉపయోగించి ఆ తర్వాత మనుషులపై ప్రయోగించాలి.
వారిని కనీసం మూడు నుండి ఆరు నెలల వరకు పర్యవేక్షిస్తూ ఉండాలి.ఎక్కడ ఏ చిన్న మందు కనిపెట్టినా కూడా ఇలాగే చేయాలి.డైరెక్ట్గా మనుషుల ప్రయోగించడం చట్ట విరుద్దం.
అందుకు ఐక్యరాజ్య సమితి కూడా ఒప్పుకోదు.
తాజాగా చైనా మాత్రం ఆ నిబందనను తుంగలో తొక్కేసింది.కరోనాకు మందు కనిపెట్టిన వైధ్యులు జంతువులపై ప్రయోగించి, ఆ తర్వాత మనుషులపై మెల్లగా ప్రయోగించాలి, కాని చైనా వైధ్యులు మాత్రం కరోనా వైరస్ను డైరెక్ట్గా మనుషులపై ప్రయోగించారు.ఈ కారణంగానే కరోనా వైరస్ బాధితుల సంఖ్య తగ్గినట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే చైనా మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ఒప్పుకోవడం లేదు.చైనాలో కరోనా మృతుల సంఖ్య పెరగకుండా ఉండాలంటే ఈ తప్పు చేయాల్సిందే అని, దీన్ని ఎవరు తప్పుబట్టనవసరం లేదు అంటు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.