మాజీ ప్రియుడితో మళ్లీ రొమాన్స్ అంటోన్న బ్యూటీ

ఛలో సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే క్రేజీ బ్యూటీగా మారింది.

అందంతో పాటు అభినయం, డ్యాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ, ఇటీవల భీష్మ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది.ఇక తన నెక్ట్స్ మూవీని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి చేస్తోన్న రష్మిక, ఇతర భాషల్లో సైతం తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.

ఇప్పటికే తమిళంలో కార్తీ సరసన నటిస్తున్న రష్మిక మరోసారి కన్నడలో నటించనున్నట్లు తెలుస్తోంది.గతంలో కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్ కిరాక్ పార్టీ చిత్రంలో తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో కలిసి రొమాన్స్ చేసి మెప్పించింది.

ఈ సినిమా సందర్భంగా అతడితో ప్రేమలో పడ్డ రష్మిక నిశ్చితార్థం కూడా చేసుకుంది.కానీ కొన్ని కారణాల వల్ల వారిద్దరు విడిపోయారు.

Advertisement

కాగా ఇప్పుడు కిరాక్ పార్టీ సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు రక్షిత్ శెట్టి రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో కిరాక్ పార్టీలో నటించిన వారితోనే సీక్వెల్ చేసి మళ్లీ అదే రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ కొట్టాలని రక్షిత్ ప్లాన్ చేస్తున్నాడు.

తాజాగా ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన ట్వీట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.మరి మాజీ ప్రియుడితో కలిసి రష్మిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఏదేమైనా కిరాక్ పార్టీ సీక్వెల్ ప్రస్తుతం కన్నడలో హాట్‌టాపిక్‌గా మారింది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు