ఆగన్న పద్దతి మార్చుకో - బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బిఆర్ఎస్,బీజేపి తదితర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఆరోపించారు.మండల కేంద్రము లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారు అని అన్నారు.

 Block Congress Party President Dommati Narsaiah Fires On Brs Leader Thota Agaiah-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్న వారిని నయానో, బయనో బెదిరిస్తున్నారని ఆరోపించారు.బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కు అతడి వయసుకు విలువ ఇస్తున్నామని అన్నారు.

విలువలు దిగ జార్చుకోవద్దని ఆగయ్య కు హితవు పలికారు.ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి,ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,పసుల కృష్ణ, పెంజర్ల సత్తయ్య యాదవ్,ఆకుల లలిత,నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube