తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న రాష్ట్రానికి రానున్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించనున్న మూడు సమావేశాల్లో అమిత్ షా పాల్గొననున్నారు.కరీంనగర్ పార్లమెంట్ పరిధి కార్యకర్తలతో భేటీ కానున్న అమిత్ షా తరువాత మహబూబ్ నగర్ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీతో సమావేశం కానున్నారు.
ఆ తరువాత హైదరాబాద్ లో వివిధ రంగాల నిపుణులతో అమిత్ షా భేటీకానున్నారు.లోక్ సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న సంగతి తెలిసిందే.