కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కలిసిన విషయం అందరికీ తెలిసిందే.ఆ భేటీ తర్వాత వెంటనే బిజెపి జాతీయ అధ్యక్షుడు జే పీ నడ్డా తో యంగ్ హీరో నితిన్ భేటీ అయిన విషయం తెలిసిందే.
హీరో నితిన్ మరియు బి జె పి మధ్య ఏం జరుగుతుంది అంటూ ఆ మధ్య రెండు మూడు రోజులు చర్చ జరిగింది.ఆ విషయం అంతా మర్చి పోతున్న సమయం లో అనూహ్యంగా బి జె పి నాయకులు కార్తికేయ 2 సినిమా సక్సెస్ నేపథ్యం లో నిఖిల్ ని బి జె పి జాతియ అధ్యక్షుడితో కల్పించాల్సింది.
పొర పాటున నితిన్ తో కల్పించారు అంటూ ఒక చర్చ మొదలైంది.ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది.
ఇప్పుడు ఈ విషయమై బి జె పి నాయకులు స్వయం గా స్పందిస్తూ పొరపాటు జరగలేదు.కన్ఫ్యూజన్ అస్సలే లేదు.నితిన్ కి స్వయంగా ఆహ్వానం తాము అందించామని.అందులో ఎలాంటి పొరపాటు లేదని క్లారిటీ ఇచ్చారు.
నిఖిల్ ని కలవాల్సింది నితిన్ ని కలిశారు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారం నిజం కాదని, తాము అనుకున్నది నితిన్ తో భేటీ అదే జరిగిందని.ఆ విషయంలో ఎక్కడ పొరపాటు అనేది లేదని తెలంగాణ రాష్ట్ర బీ జే పీ నాయకులు క్లారిటీ ఇస్తున్నారు.
నితిన్ ని ఎందుకు జాతీయ అధ్యక్షుడి తో భేటీ కి ఆహ్వానించారు అంటే మాత్రం వారి వద్ద సమాధానం లేదు.మొత్తానికి నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.
కనుక బి జె పి నాయకులు తప్పు చేసి ఏదో కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా అంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.ముందు ముందు అయినా నిఖిల్ తో బీ జే పీ నాయకులు భేటీ అవుతారు చూడాలి.
ఈ విషయమై ఇప్పటి వరకు నితిన్ కానీ నిఖిల్ కానీ అధికారికంగా ఎలాంటి స్పందన మీడియాకు ఇవ్వలేదు.