తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు..

నాంపల్లి: గన్ పార్క్ లో తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద అమర వీరులకు నివాళులు అర్పించిన బీజేపీ ఎమ్మెల్యే లు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘు నందన్ రావు.నిర్భంద పాలన నశించాలి అంటూ నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు.

 Bjp Leaders Pays Tributes To Telangana Martyrs Details, Bjp Leaders ,tributes ,t-TeluguStop.com

ప్రజా సంక్షేమ విధాన పత్రమే గవర్నర్ గారి ప్రసంగం.దీని మీద చర్చించడం ఎమ్మెల్యే గా మా హక్కు.

కానీ కేసీ ఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజా స్వామ్యాన్ని అపహస్యం చేశారు.గవర్నర్ గారి కే దిక్కు లేకుండా చేస్తే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవుతుంది.

మైకులు కట్ చేసి అవమానిస్తారు.మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో.

తెలంగాణ ఉద్యమంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం మాకు ఎప్పుడు దక్కింది.మేము ముగ్గురము కావొచ్చు … కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వం.

రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుంది.అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండ గడతం.

ప్రజల సమస్యలు పరిష్కరించ డానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం.కేసీఆర్ గారు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించండి.

లేదంటే రేపు మీకు కూడా అదే గతి పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube