నాంపల్లి: గన్ పార్క్ లో తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద అమర వీరులకు నివాళులు అర్పించిన బీజేపీ ఎమ్మెల్యే లు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘు నందన్ రావు.నిర్భంద పాలన నశించాలి అంటూ నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు.
ప్రజా సంక్షేమ విధాన పత్రమే గవర్నర్ గారి ప్రసంగం.దీని మీద చర్చించడం ఎమ్మెల్యే గా మా హక్కు.
కానీ కేసీ ఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజా స్వామ్యాన్ని అపహస్యం చేశారు.గవర్నర్ గారి కే దిక్కు లేకుండా చేస్తే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవుతుంది.
మైకులు కట్ చేసి అవమానిస్తారు.మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో.
తెలంగాణ ఉద్యమంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం మాకు ఎప్పుడు దక్కింది.మేము ముగ్గురము కావొచ్చు … కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుంది.అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండ గడతం.
ప్రజల సమస్యలు పరిష్కరించ డానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం.కేసీఆర్ గారు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించండి.
లేదంటే రేపు మీకు కూడా అదే గతి పడుతుంది.