మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందిన తర్వాత మా సభ్యుల ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ప్రముఖ ఏఐజీ హాస్పిటల్ లో మా సభ్యులందరికీ ఉచిత చెకప్ చేయించుకునే అవకాశాన్ని కల్పించారు.
ఈ క్రమంలోనే డాక్టర్ కన్సల్టేషన్ తో పాటు ఏడు రకాల చెకప్స్ నిర్వహించుకోవచ్చని ఈ సందర్భంగా మంచు విష్ణు తెలిపారు.ఈ క్రమంలోనే ఏఐజి హాస్పిటల్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు మా బిల్డింగ్ గురించి ప్రస్తావించారు.ఇప్పటివరకు మా బిల్డింగ్ లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు.దీంతో మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు తన సొంత డబ్బులతో మా బిల్డింగ్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు.అయితే ఇప్పటివరకు ఏ మాత్రం మా బిల్డింగ్ కార్యరూపం దాల్చలేదు.
ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో విష్ణు మాట్లాడుతూ మరో ఆరు నెలల్లో మా బిల్డింగ్ భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా మంచు విష్ణు తెలిపారు.
మా సభ్యుల సంక్షేమం ఆరోగ్యమే తనకు ప్రధానమని అందుకే తన కమిటీ సభ్యులతో కలిసి మా సభ్యుల సంక్షేమం కోసం ఎన్నో ప్రణాళికలు రచించామని విష్ణు తెలిపారు.ఇక టికెట్ల విషయం గురించి మంచు విష్ణు ఈ సందర్భంగా మరోసారి ప్రస్తావిస్తూ టికెట్ల ధరలు అనేది ఒక్కరి నిర్ణయం కాదని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ అందరూ కలిసి నిర్ణయం తీసుకునే విషయాన్ని ఈ సందర్భంగా విష్ణు మరోసారి టిక్కెట్ల ధరల గురించి వెల్లడించారు.