ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈసమావేశాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కొత్త శాఖను తీసుకు వస్తున్నట్లుగా ప్రకటించింది.
రాష్ట్రంలోని యువతకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగం కల్పించేందుకు ఈ కొత్త శాఖ పని చేయబోతుంది.స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ పేరుతో ఈ శాఖ పని చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో కొత్తగా రాబోతున్న పరిశ్రమల్లో 75 శాతం ఖచ్చితంగా స్థానికులను తీసుకోవాలంటూ జీవో తీసుకు వచ్చారు
స్థానికులకు పరిశ్రమలో అవకాశం ఇవ్వాలంటే వారి వద్ద స్కిల్స్ ఉండాలి.అందుకే వారికి స్కిల్స్ను నేర్పించేందుకు ఈ శాఖను ఏర్పాటు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ శాఖ ఖచ్చితంగా యువతకు మంచి ఉపయోగదాయకం అంటూ ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు.ప్రస్తుతం యువత ఏపీలో నిరుద్యోగంతో బాధపడుతున్నారు.
వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగంలో పెట్టించేందుకు ఈ శాఖ కృషి చేస్తుందని ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు.