ఇటీవల టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు సంఖ్య విషయంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని బోర్డులో సభ్యులుగా తీసుకుంటూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.దాదాపు 25 మందిని ఎంచుకుని టీటీడీ బోర్డు నూతన పాలకమండలి జాబితా ఖరారు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ బీజేపీ నేతల బృందం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నీ కలిశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది.
ఈ నూతన పాలకమండలి సభ్యులు విషయంలో ప్రభుత్వాని పిలిచి మాట్లాడాలని గవర్నర్ ని కోరారు.సీఎం జగన్ కి హిందూ ధార్మిక సంస్థలు పైభక్తి భావం లేదని.
హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ప్రత్యేక ఆహ్వానితులు విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు.
అంత మంది సభ్యులు ఉంటే భక్తులకు అసౌకర్యం గా ఉంటుందని సోము వీర్రాజు తెలిపారు.ఈ విషయంలో గవర్నర్ ప్రభుత్వాన్ని పిలిపించి సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్చించాలని కోరినట్లు సోము వీర్రాజు.
భేటీ అనంతరం మీడియాతో తెలిపారు.