కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థుల స్క్రూట్నీలో ఆసక్తికర పరిణామం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థుల స్క్రూట్నీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.ఈ మేరకు నామినేషన్ వేసిన అభ్యర్థులపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు జలగం వెంకటరావు ఫిర్యాదు చేశారు.

 An Interesting Development In The Scrutiny Of Kothagudem Constituency Candidates-TeluguStop.com

ఈ క్రమంలో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ ను అధికారులు రిజెక్ట్ చేశారు.అదేవిధంగా జలగం వెంకటరావు వేసిన కేసులో 24 గంటల్లోపు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ కాపీ తీసుకురావాలని బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వర రావుకు ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఐపీసీ 170 ప్రకారం వనమా నామినేషన్ తిరస్కరించాలని జలగం అన్నారు.జీవిత భాగస్వామి పేరు, ఆస్తులను ప్రకటించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే డాక్యుమెంటరీ రుజువులు సమర్పించిన జలగం వనమా నామినేషన్ తిరస్కరించకపోవడానికి కారణాలని చెప్పాలని విజ్ఞప్తి చేశారు.దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి వనమా మరోసారి చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube