17 ఎంపీ స్థానాలు గెలుపే లక్ష్యం..: ఈటల రాజేందర్

తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.

 Aim To Win 17 Mp Seats..: Etala Rajender-TeluguStop.com

17 ఎంపీ స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు.

ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.అలాగే ఎన్నికల హామీలను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరన్న ఈటల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.మోదీకి ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube