ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone tapping case )లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీలకు నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఈ మేరకు కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు( Tirupatanna, Bhujangarao ) కస్టడీ ముగియడంతో పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.దీంతో వారిద్దరికి నాంపల్లి కోర్టు జ్యుడిషయల్ రిమాండ్ విధించింది.ఈ క్రమంలో తిరుపతన్న, భుజంగరావు ఈ నెల 6వ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నారు.