కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి కావాలి..: మోదీ

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా కామారెడ్డిలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరైన మోదీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

 Telangana Needs Freedom From Congress And Brs..: Modi-TeluguStop.com

బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని మోదీ అన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలని తెలిపారు.

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న మోదీ సకల జనుల సౌభాగ్య తెలంగాణే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు.బీజేపీ చెప్పింది చేస్తుందన్న మోదీ తెలంగాణకు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని తెలిపారు.

పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ ఇస్తామన్న మాటను నెరవేర్చామన్నారు.తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని తెలిపారు.

దేశంలో బీసీని ప్రధాని చేసింది కూడా బీజేపీనేని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube