కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి కావాలి..: మోదీ

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా కామారెడ్డిలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరైన మోదీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని మోదీ అన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలని తెలిపారు.

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న మోదీ సకల జనుల సౌభాగ్య తెలంగాణే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు.

బీజేపీ చెప్పింది చేస్తుందన్న మోదీ తెలంగాణకు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని తెలిపారు.

పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ ఇస్తామన్న మాటను నెరవేర్చామన్నారు.తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని తెలిపారు.

దేశంలో బీసీని ప్రధాని చేసింది కూడా బీజేపీనేని వెల్లడించారు.

మూవీ ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!